రోడ్ల ఆక్రమణలకు ఇక చెక్..!

#### ఫుట్‌పాత్‌ల పరిరక్షణకు కఠిన నిబంధనలు.. ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు

#### అక్రమ పార్కింగ్, రోడ్లపై నిర్మాణ సామగ్రి, ఆక్రమణలపై కమిషనర్‌కు విస్తృత అధికారాలు

**హైదరాబాద్, జూలై 13:

పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం, పాదచారుల భద్రత, రోడ్ల ఆక్రమణల నివారణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) బిల్లు–2026లో మరిన్ని కీలక నిబంధనలను చేర్చింది. ప్రైవేట్ వీధుల అభివృద్ధి నుంచి రోడ్ల ఆక్రమణల తొలగింపు, పార్కింగ్ నియంత్రణ, ఫుట్‌పాత్‌ల పరిరక్షణ వరకు కమిషనర్‌కు విస్తృత అధికారాలను బిల్లులో ప్రతిపాదించారు.

బిల్లు ప్రకారం అనుమతి లేకుండా ప్రైవేట్ వీధులు ఏర్పాటు చేయడం, లేఅవుట్లు అభివృద్ధి చేయడం లేదా భవన నిర్మాణాల కోసం భూములను విక్రయించడం వీలు కాదు. కమిషనర్ అనుమతి పొందిన తర్వాతే పనులు ప్రారంభించాలి. నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి చేపడితే నిర్మాణాలను సవరించడం, కూల్చివేయడం లేదా యథాస్థితికి తీసుకురావాలని ఆదేశించే అధికారం కమిషనర్‌కు ఉంటుంది.

### రోడ్లపై ఆక్రమణలకు వెంటనే తొలగింపు

రోడ్లు, ఫుట్‌పాత్‌లు లేదా ప్రజా ప్రదేశాల్లో ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే షెడ్లు, స్టాళ్లు, నిర్మాణాలు, బోర్డులు, ఇతర వస్తువులను అనుమతి లేకుండా ఏర్పాటు చేయరాదని బిల్లులో స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఆక్రమణలను కమిషనర్ వెంటనే తొలగించడంతో పాటు ఖర్చును సంబంధిత వ్యక్తుల నుంచే వసూలు చేయవచ్చు.

### పండుగలకు తాత్కాలిక అనుమతి

వేడుకలు, ఉత్సవాలు, సామాజిక కార్యక్రమాల సందర్భంగా షామియానాలు, పందిళ్లు, తాత్కాలిక బూత్‌ల ఏర్పాటుకు కమిషనర్ ప్రత్యేక అనుమతి ఇవ్వవచ్చు. అయితే అవి వాహనాలు, పాదచారుల రాకపోకలకు కనీస అంతరాయం కలిగించేలా ఉండాలని బిల్లు పేర్కొంది.

### రోడ్లు తవ్వితే వెంటనే పునరుద్ధరణ

మున్సిపల్ పనులు లేదా ఇతర అవసరాల కోసం రోడ్లు తవ్విన వెంటనే వీలైనంత త్వరగా వాటిని పునరుద్ధరించాలని నిబంధనలు సూచిస్తున్నాయి. పనుల సమయంలో ట్రాఫిక్ మళ్లింపు, సమీప భవనాలకు ప్రవేశం, నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తవ్విన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు, రాత్రి వెలుతురు ఏర్పాటు తప్పనిసరి.

### అనుమతి లేకుండా రోడ్లు తవ్వితే చర్యలు

కమిషనర్ అనుమతి లేకుండా రోడ్లు తవ్వడం, నిర్మాణ సామగ్రిని రోడ్డుపై నిల్వ చేయడం లేదా స్కాఫోల్డింగ్ ఏర్పాటు చేయడాన్ని నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే నిర్మాణ సామగ్రిని తొలగించి ఖర్చును సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేసే అవకాశం ఉంటుంది.

### వీధి పేర్లు, ఇంటి నంబర్లకు చట్టబద్ధత

వీధుల పేర్లు నిర్ణయించడం, మార్పు చేయడం, ఇంటి నంబర్లు కేటాయించడం వంటి అధికారాలు కమిషనర్‌కు ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీధుల పేర్లు మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అనుమతి లేకుండా వీధి పేరు బోర్డులు లేదా ఇంటి నంబర్లను మార్చడం, ధ్వంసం చేయడం నేరంగా పరిగణిస్తారు.

### కార్నర్ భవనాలకు ప్రత్యేక నిబంధనలు

రెండు రోడ్లు కలిసే కూడళ్ల వద్ద ఉన్న భవనాల మూలలను ట్రాఫిక్ భద్రత కోసం గుండ్రంగా లేదా వంపుగా మార్చాలని కమిషనర్ ఆదేశించవచ్చు. అవసరమైతే ప్రహరీ గోడలు, చెట్ల తొలగింపుపైనా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇందువల్ల కలిగే నష్టానికి చట్టం ప్రకారం పరిహారం చెల్లించనున్నారు.

### పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణకు కొత్త విధానం

ట్రాఫిక్ పోలీసులతో కలిసి పార్కింగ్, నో-పార్కింగ్ జోన్లను గుర్తించడం, ఆన్‌స్ట్రీట్‌, ఆఫ్‌స్ట్రీట్‌ పార్కింగ్ వ్యవస్థను నియంత్రించడం, అవసరమైతే వినియోగ రుసుములు విధించడం, పీపీపీ విధానంలో పార్కింగ్ సదుపాయాలు అభివృద్ధి చేయడం వంటి అధికారాలను కార్పొరేషన్‌కు బిల్లు కల్పించింది. భారీ వాహనాల రాకపోకలపై సమయపరమైన ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంటుంది.

### ఫుట్‌పాత్‌లకు ప్రత్యేక రక్షణ

ప్రతి కార్పొరేషన్ తప్పనిసరిగా ఫుట్‌పాత్‌లు, జీబ్రా క్రాసింగ్‌లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, ర్యాంపులు, టాక్టైల్ పాత్‌వేలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, గార్డ్‌రైల్స్‌, బస్‌స్టాప్‌లకు అనుసంధానమైన పాదచారుల సదుపాయాలను ఏర్పాటు చేసి నిర్వహించాల్సి ఉంటుంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా అన్ని పాదచారుల సదుపాయాలను రూపొందించాలని బిల్లు నిర్దేశించింది.

### ఫుట్‌పాత్ ఆక్రమిస్తే తక్షణ ఖాళీ

ఫుట్‌పాత్‌లు, రోడ్లు, పాదచారుల మార్గాలను ఆక్రమించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం, ప్రజా మౌలిక వసతులను ధ్వంసం చేయడం నిషేధం. ఆక్రమణల వల్ల ట్రాఫిక్‌కు లేదా పాదచారులకు ఇబ్బందులు కలిగితే కమిషనర్ ఎలాంటి ఆలస్యం లేకుండా వాటిని తొలగించే అధికారం కలిగి ఉంటారు. రహదారులను విస్తరించడం, మెరుగుపరచడం, పాదచారుల భద్రత కోసం అవసరమైన చర్యలు చేపట్టే అధికారాన్ని కూడా బిల్లు కమిషనర్‌కు కల్పించింది.

జూబ్లీహిల్స్ ప్రాంతంలో అత్యంత పకడ్బందీగా జరిగిన గృహ దొంగతనం

కేసులో ఐదుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు మరియు హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా విజయవంతంగా అరెస్ట్ చేశారు.

తేదీ 05-02-2026న, పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి జీవన్ చంద్ నేతృత్వంలోని నేపాలీ ముఠా, జూబ్లీహిల్స్‌లోని నందిగిరి హిల్స్ లో గల ఒక ఇంట్లో ముందస్తు ప్రణాళికతో దొంగతనానికి పాల్పడింది. అదే ఇంట్లో పనిమనిషిగా చేరుకున్న నిందితురాలు ఇతర సహచరులు లోపలికి రావడానికి సహకరించడమే కాకుండా, ఇంట్లోని వాచ్‌మెన్ మరియు వంటమనిషికి మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లింది. యజమాని మరియు కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని, సుమారు ₹1.3 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు.

ఈ కేసులోని నిందితులు - జీవన్ @ జీబన్ బహదూర్ చంద్ (1), భువన్ / భూపేందర్ షాహి (2), కృష్ణ చంద్ (3), రమేష్ బహదూర్ చంద్ (4), దేబీ కాడెల్ @ బిమ్లా (5), జనక్ కుమార్ బిక్రమ్ షాహి (6), లలిత్ బహదూర్ చంద్ (7), మదన్ ఖత్రి (8) మరియు బోహర సుశీల్ (9) కలిసి హైదరాబాద్‌లోని సంపన్న గృహాలను లక్ష్యంగా చేసుకునేవారు. వీరిలో ఒకరిని పనిమనిషిగా చేర్చి, ఇంటి భద్రతా ఏర్పాట్లు మరియు విలువైన వస్తువులపై నిఘా ఉంచిన అనంతరం, సిబ్బందికి మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడటం వీరి శైలి.సాంకేతిక ఆధారాలు మరియు క్షేత్రస్థాయి విచారణ ద్వారా పోలీసులు కింది ఐదుగురు నిందితులను పట్టుకున్నారు:

1. రమేష్ బహదూర్ చంద్ – నేర అమలులో ప్రధాన పాత్ర.

2. జనక్ కుమార్ బిక్రమ్ షాహి – దొంగతనం సొత్తును తీసుకోవడం మరియు కుట్రకు సహకరించడం.

3. లలిత్ బహదూర్ చంద్ – ఆర్థిక సహాయం మరియు నేరస్థులకు ఆశ్రయం కల్పించడం.

4. మదన్ ఖత్రి – పనిలో చేరడానికి మధ్యవర్తిత్వం వహించడం.

5. బోహర సుశీల్ – నిందితులకు ఆశ్రయం కల్పించి, తప్పించుకోవడానికి సహకరించడం.

నిందితుల నుండి సెల్ ఫోన్లు, దొంగిలించిన ఆభరణాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, బాచుపల్లి మండలం, నిజాంపేట్ లోని సాయినగర్ లో గల బోహర సుశీల్ నివాసంలో సమావేశమై దొంగతనానికి పథకం వేశారు. నేరం జరిగిన తర్వాత నేపాల్‌కు పారిపోయేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ నేడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు జీవన్ బహదూర్ చంద్, భువన్ షాహి మరియు దేబీ కాడెల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అధికారుల బృందం:

జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సత్యనారాయణ మరియు సిబ్బంది, SHO శ్రీ కె. వెంకటేశ్వర రెడ్డి నేతృత్వంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీ ఎస్. వెంకట్ రెడ్డి, అదనపు డిసిపి శ్రీ కె. శ్రీకాంత్ మరియు జూబ్లీహిల్స్ జోన్ డిసిపి శ్రీ ఎ. రమణ రెడ్డి గారి పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించబడింది.

రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

హిట్ అండ్ రన్ కేసు నమోదు

మద్యం మత్తులో కారు నడిపి ఓ వ్యక్తిని ఢీకొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది

రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

అతి వేగంతో వచ్చిన ఎరుపు రంగు స్కోడా ర్యాపిడ్ కారు, రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని తీవ్రంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగాక స్థానికులు కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు.

అతడు విపరీతంగా మద్యం తాగి, నిలబడే పరిస్థితిలో కూడా లేకపోవడంతో తన పేరు కూడా చెప్పలేకపోయాడు.

కారులో ఉన్న ఒక యువతి ఏ విషయాన్నీ చెప్పడానికి నిరాకరించింది.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

విచారణ సమయంలో డ్రైవర్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Etharam news correspondent

డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు

ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ తో పాటు

మరో కానిస్టేబుల్ , సిఐకి గాయాలు

అబిడ్స్ , అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లలో

మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు

ఆదివారం మధ్యాహ్నం హెచ్ న్యూ (హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు అబిడ్స్ లో డ్రగ్స్ డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లు సమాచారం అందింది

దీనితో అతను ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి , హెచ్ న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరియు ఇతర ఇబ్బందితో కలిసి అబిడ్స్ పరిసరాల్లో నిఘా పెట్టారు

నిన్న మధ్యాహ్నం ఓ బ్లూ కలర్ బెలోనో కార్ అబిడ్స్ లోని పాయల్ ఫుట్ వేర్ వద్దకు రాగానే , ఓ వ్యక్తి అతనికి ఒక ప్యాకెట్ ను అందజేశాడు

అక్కడే ఉన్న హెచ్ న్యూ పోలీసులు ప్యాకెట్ అందజేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు

కారులో ఉన్న హుస్సేని అలం కు చెందిన సైఫ్ కు పోలీసులు ఐడి కార్డులు చూపెట్టి , కారు నుండి దిగాలని సూచించారు

కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా కారును రివర్స్ చేయడంతో , అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మహేందర్ కాలు సై నుండి కారు ఎక్కించాడు

ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అతన్ని చేంజ్ చేసి అఫ్జల్ గంజ్ వద్ద అడ్డుకున్నారు

ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ , మరో కానిస్టేబుల్ వంశిధర్ లకు స్వల్ప గాయాలయ్యాయి

అప్జల్ గంజ్ వద్ద సైఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

కాలుపై నుండి కారు వెళ్లడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు కాలు ఫ్రాక్చర్ అయింది

అతన్ని సోమజిగూడా యశోద హాస్పిటల్ కు తరలించి , చికిత్స అందిస్తున్నారు

మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్ పై అబిడ్స్ , అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లలో అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు అయ్యాయి

సైఫ్ ను హెచ్.న్యూ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Our Editorial Charter

We do not publish breaking-news panic; we deliver context when the dust settles. Independent urban reporting, always.

The Urban Dispatch Editorial Board

Get Your Daily NEWS

Receive sharp contextual news, longform culture, and local pulse delivered directly to your inbox. No clickbait, just clarity.